సెల్ఫీ తీసుకోబోయి లోయలో పడిపోయాడు!

-

సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. నేటి జనరేషన్ ఎక్కడికెళ్లినా.. ఎవరిని కలిసినా.. ముందుగా వాళ్లు చేసే పని ఇదే. అదే సెల్ఫీ. సెల్ఫీ తీసుకున్న తర్వాతే ఏ పనయినా.. చాలామందికి ఇప్పుడు సెల్ఫీ పిచ్చి ఎక్కువైంది. ఎక్కడికెళ్లినా ముందు సెల్ఫీ దిగాలనే ఆరాటం ఎక్కువై పోతుంది. సెల్ఫీల పేరుతో చాలామంది ఎన్నో ప్రమాదాలకు గురయిన విషయం కూడా మనకు తెలిసిందే. అయినా కూడా సెల్ఫీల గోల మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే సెల్ఫీ తీసుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు కానీ.. ప్రాణాలు పోతే పరిస్థితి ఏంది. అందుకే సెల్పీ మోజులో పడి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెకు సమీపంలో సింహాగద్ పోర్ట్ దగ్గర జరిగింది. లోయలో పడిపోయిన వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే లోయలోకి దిగి రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో మనోడు ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అది సంగతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version