ఎయిర్ ఇండియా విమానం నుంచి కింద పడిన ఎయిర్ హోస్టెస్..!

-

అవును.. మీరు చదివిన టైటిల్ కరెక్టే.. దీంట్లో ఏం మతలబు లేదు. కానీ.. ఆమె పడింది విమానం గాల్లో ఉండగా మాత్రం కాదు. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నది. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కోసం ఉదయం 7 గంటలకు రెడీ అయింది. అయితే.. ప్రయాణికులంతా ఎక్కిన తర్వాత ఆ విమానం తలుపులు మూయడానికి ఎయిర్ హోస్టెస్ వెళ్లింది. అయితే.. ప్రయాణికులు ఎక్కడానికి ఉపయోగించే నిచ్చెనకు, విమానం డోర్ కు మధ్యలో గ్యాప్ ఉంది. ఎయిర్ హోస్టెస్ చూసుకోకుండా విమానం గ్యాప్ మధ్యలో పడిపోయింది. దీంతో ఎయిర్ హోస్టెస్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ యువతిని ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో సరైన సమయానికి బయలుదేరాల్సిన విమానం కాస్త గంట ఆలస్యంగా బయలు దేరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version