చనిపోయిన వ్యక్తి 15 రోజుల తర్వాత తిరిగొచ్చాడు…!

-

చనిపోయిన వ్యక్తి ఏంది… మళ్లీ తిరిగి రావడమేంది.. అని అనుకుంటున్నారా? అవును.. నిజంగానే తిరిగి వచ్చాడు. దీంతో ఆ వ్యక్తిని చూసి అంతా దడుసుకున్నారు. దెయ్యం వచ్చిందా అని భయపడ్డారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ లో చోటు చేసుకున్నది.

అసలేం జరిగిందంటే… వేనాద్ కు సమీపంలోని ఆడిక్కోల్ని ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల సాజి సెప్టెంబర్ 3న కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా… కర్ణాటకలోని అడవుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడని.. పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని సాజి కుటుంబ సభ్యులకు చూపించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండిపోవడం… మృతదేహానికి ఉన్న డ్రెస్సులు కూడా సాజి డ్రెస్సుల్లాగానే ఉండటంతో తమ కొడుకే అని అనుకొని కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తమ ఊరికి తీసుకెళ్లి ఖననం చేశారు.

బంధువులను పిలిచి చిన్న కర్మ, పెద్ద కర్మ కూడా జరిపించారు. చెట్టంత కొడుకు కానరాకుండా పోయాడని అతడి తల్లిదండ్రులు బోరున విలపించారు. తర్వాత 15 రోజులకు సాజి తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో సాజిని చూసి షాకయ్యారు కుటుంబ సభ్యులు. ముందు అతడిని చూసి భయపడినా.. తర్వాత అసలు విషయం తెలుసుకొని కూల్ అయ్యారు. కనిపించకుండా పోయిన వ్యక్తి చనిపోయాడనుకొని వేరే వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేశామని తెలుసుకొని… ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తమ కొడుకు మళ్లీ తిరిగి రావడంతో ఆ ఇంట ఆనందం వెల్లువిరిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version