ఒకే కాన్పులో ఐదుగురుకు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి.. ఆ త‌ర్వాత‌

-

సంగానెరా గ్రామానికి చెందిన రుక్సానా(25) అనే మహిళ రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లోని జనతా ఆసుపత్రిలో నెలలు నిండకముందే ఐదుగురు శిశువులకు జన్మను ఇచ్చింది. వీరిలో ముగ్గురు మగ శిశువులు. ఇద్దరు ఆడ బిడ్డలు. అయితే వీరిలో ఓ శిశువు బరువు చాలా తక్కువగా ఉండ‌డంతో జన్మిస్తూనే చనిపోగా.. మరొకరు వెంటిలేటర్‌పై ఉన్నారు.

ఇదే విషయమై ఆసుపత్రి డాక్టర్ లతా రాజోరియా మాట్లాడుతూ.. రుక్సానా అనే గర్భిణి ఐదుగురు శిశువుకు జన్మనిచ్చిందని, వీరంతా తక్కువ బరువుతో పుట్టారని, శిశువులలో ఒకరు చనిపోగా.. మరొక శిశువు వెంటిలేటర్‌లో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన ముగ్గురు నవజాత శిశువులను జాగ్రత్తగా చూస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు ఇటువంటి అరుదైన ఆపరేషన్లు జరిగినప్పటికీ తమ హాస్పిటల్‌లో మాత్రం ఇదే తొలిసారి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version