ఆనందంగా జీవించాలంటే శారీరిక మరియు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. చాలా శాతం మంది వయస్సు పెరిగే కొద్దీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని భావిస్తారు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని కంగారు పడుతూ ఉంటారు. అయితే వయసు పెరిగినా సరే మెదడు ఎంతో చురుగ్గా పనిచేయాలి అంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. కొన్ని అలవాట్లను చేసుకోడం వలన మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకంగా వయసు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరగడం వలన కార్టిసోల్, హార్మోన్ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. దీంతో జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది మరియు ఎటువంటి నిర్ణయాలను అయినా తీసుకోవడం కష్టంగా మారుతుంది. అందువలన వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు బాగుండాలంటే ఈ అలవాట్లను తప్పకుండా చేసుకోండి.
ప్రతిరోజు తప్పకుండా పుస్తకాలను చదవడం, ధ్యానం చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, పైగా ఒత్తిడి తగ్గుతుంది. దీంతో పాటుగా సరైన నిద్ర కూడా ఎంతో అవసరం. ఎప్పుడైతే నిద్రను పొందుతారో, మెదడుకు ఒక రిపేర్ లాగా జరుగుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా రోజంతా ఏకాగ్రతతో మీ పనులు చేసుకోగల సామర్థ్యం వస్తుంది. కనుక కచ్చితంగా ప్రతిరోజు మంచి నిద్రను పొందాలి. అంతే కాక మెదడుకు శక్తిని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలను డైట్ లో భాగంగా చేర్చుకోవాలి. మెదడు ఆరోగ్యానికి వాల్నట్స్, బెర్రీలు, డార్క్ చాక్లెట్, ఒమేగా త్రీ ఉండేటువంటి ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి.
కనుక ఇటువంటి ఆహార పదార్థాలను తప్పకుండా డైట్ లో భాగంగా చేర్చుకోవాలి. ఇలా చేస్తే మెదడు పనితీరు మెరుగ్గా జరుగుతుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి విషయాలను కూడా మనసులో పెట్టుకోకూడదు. బాధ కలిగించే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక ప్రతి రోజు బాధపడుతూ ఒకే విషయం గురించి ఆలోచించకూడదు. మనస్సు గురించి ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తారో మరియు ఆలోచనలను తగ్గించుకుంటారో, మెదడు ఎంతో ఆరోగ్యంగా పనిచేస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోకుండా ఉంటుంది.