Fact Check : కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా అందంగా పుడతారా..?

-

గర్బిణులు కుంకుమ పువ్వు తింటే పుట్టబోయే బిడ్డ అందంగా, తెల్లగా పుడతారా? ఇది ఎంతవరకు నిజం..? ప్ర‌ధానంగా గ‌ర్భిణీ మ‌హిళ‌లు దీన్ని నిత్యం పాల‌లో క‌లుపుకుని కూడా తాగుతుంటారు. కుంకుమ పువ్వులో మ‌న శ‌రీరానికి మేలు చేసే పోష‌కాలు ఎన్నో ఉన్నాయన్నది నిజం. కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ శ‌రీరంలోని ర‌క్తం శుద్ధి అవుతుంది. మ‌జిల్ రిలాక్సంట్ గుణాలు కుంకుమ పవ్వులో ఉండ‌డం వ‌ల్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం కలుగుతుంది. ఈ క్ర‌మంలో శిశువుకు కూడా ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా జరగటం వల్ల పుట్టబోయే బిడ్డ చ‌ర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంద‌ట‌. కుంకుమ పువ్వుకు బిడ్డ రంగుకు సంబంధం లేదని సైంటిస్టుల పరిశోదనలో తేలింది. త‌ల్లిదండ్రుల జీన్స్ ఆధారంగానే బిడ్డకు రంగు ఉంటుందని ఆ పరిశోధనల సారాంశం.

ఏదైన మితిమీరి తీసుకుంటే ప్రమాదమే.. అలాగే కుంకుమ పువ్వు కూడా పరిమితంగా తీసుకోవాలనేది వైద్యుల సూచన. గ‌ర్భిణీలు నిత్యం 10 గ్రాముల‌కు మించ‌కుండా కుంకుమ పువ్వును తీసుకోవాలి‌. లేదంటే దాంతో అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. 3వ నెల త‌రువాత నుంచి కుంకుమ పువ్వును తీసుకోవచ్చునని పాలలో కాని, తినే ఆహార పదార్థాలలో కాని కలిపి తీసుకోవచ్చు..

కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల పిల్లలు అందంగా పుడతారనేది వాస్తవం కాదన్నమాట.. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కోసం వాడటం మంచిదే.

Read more RELATED
Recommended to you

Latest news