గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరిదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదంలో కూడా పాకిస్తాన్ హస్తం ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతేకాకుండా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 110 మంది మరణించారు. మరికొంతమంది విపరీతంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత మాత్రం అధికంగా జరిగిందని సమాచారం అందుతోంది. ప్రమాదంలో గాయపడిన వారు మాత్రం బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.