చనిపోయిన భర్త వీర్యంతో తల్లి అయిన మహిళ

-

చనిపోయిన భర్త వీర్యంతో తల్లి అయింది ఓ మహిళ. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన అరుణ్, సంగీత (48) దంపతులకు పెళ్లయి 27 ఏళ్లయినా సంతానం కలగలేదు. దీంతో రెండేళ్ల క్రితం IVF విధానాన్ని ఆశ్రయించారు. అరుణ్ వీర్యాన్ని ల్యాబ్ లో భద్రపరిచారు.

Woman in Bengal preserves sperm Of dead husband to become mother

ఇంతలో కరోనా కారణంగా భర్త అరుణ్ అన్నముశారు. ఒంటరిగా మారిన సంగీత భర్త జ్ఞాపకంగా బిడ్డను కణాలనుకున్నారు. IVF విధానంలో భద్రపరిచిన అరుణ్ వీర్యాన్ని సంగీత అండంలోకి ప్రవేశపెట్టడంతో గర్భవతి అయ్యారు. డిసెంబర్ 12న మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా.. ప్రపంచంలో వచ్చిన మార్పులు, అహారపు అలవాట్ల కారణంగా.. మహిళలకు సంతానం గతంలో లాగా.. ఈజీగా కలుగడం లేదన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news