ఎల్బీనగర్ – అమీర్ పేట్ మెట్రో  నేడే ప్రారంభం

-

నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైలు కారిడార్‌-1 సోమవారం నుంచి పూర్తిస్థాయిలో  అందుబాటులోకి రానుంది. అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 16 కి.మీ. మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. దీంతో లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ  ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు స్థానిక మంత్రులూ పాల్గొంటారు. గవర్నర్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు మెట్రోలో అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ వరకు ప్రయాణిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులను ఈ మార్గంలో అనుమతించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version