నేడు సీఎం తో ఉత్తమ్ భేటీ?

-

తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.  దీంతో  కేసీఆర్ ని తట్టుకుని ఎదుర్కొనేది ఎలా అనే విషయంపై నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. శనివారం హైదరాబాద్ రానున్న బాబుని ఉత్తమ్ కలిసి తెదేపా – కాంగ్రెస్ పొత్తుపై చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెరాస ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీకి ఉపయోగపడే వారిని ఆహ్వానిస్తోంది… ఇందులో భాగంగానే శుక్రవారం నాడు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. తెలంగాణలో మనుగడలేని పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవం హాస్యాస్పదం అంటూ తెరాస నేతలు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news