పోడు రైతులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే పట్టాలు

-

హైదరాబాద్​లో దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్​లో ఎస్ఆర్ శంకరన్​ కాన్ఫరెన్స్​ హాలును రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో కలిసి కేక్​ కట్​ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే అర్హులైన వారికి పోడు పట్టాలను అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్​ చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, గిరిజనులు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

శనివారం ఇటీవల శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆదివాసీల కోసం సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారని సత్యవతి రాథోడ్​ చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్​ చోంగ్తు, స్పెషల్​ సెక్రటరీ శ్రీధర్​ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లను సీఎం కేసీఆర్​ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారని, దాని వల్ల గిరిజనులకు అవకాశాలు మరింత పెరిగాయని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version