సీఎం చంద్రబాబునాయుడు దంపతులు మూల నక్షత్రం పురస్కరించుకుని ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం కుటుంబ సభ్యులకు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, ఛైర్మన్ గౌరంగబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.. ప్రత్యేక పూజల అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఏటికేడు పెరుగుతోందన్నారు. ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో పాటు చంద్రబాబు రాకతో క్యూలైన్లలోని భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకతప్పలేదు.
రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
-
Previous article
Next article