అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్

-

తెరాస అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వారి నియోజకవర్గాల్లో పార్టీ ప్రచార తీరుని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవన్ లో సదస్సుకు హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం చేసిన అవలంభించిన సంక్షేమ పథకాల అమలు తీరుని అభ్యర్థులు వివరించాలన్నారు. వీలైతే ప్రభుత్వ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరిని కలిసి తెరాస ఆవశ్యకతను వెల్లడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను సైతం అభ్యర్థులకు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ ప్రచార వ్యూహం, ఎన్నికల కసరత్తులు తదితర అంశాల మీద దిశానిర్ధేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version