అమీర్ పేట్ – ఎల్బీనగర్ మెట్రో 24 న ప్రారంభం

-

అత్యంత రద్దీగల అమీర్ పేట్ – ఎల్బీనగర్ మార్గంలో  ప్రయాణించే వారికి శుభవార్త. ఈ నెల 24 మధ్యాహ్నం 12.15 గంటలకు మెట్రో లైన్ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆహ్వానపత్రాన్ని మంత్రి కేటీఆర్ గవర్నర్ ను కలిసి నేడు అందించారు.  కేటీఆర్ వెంట సీఎస్ ఎస్ కే జోషి, అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు.  నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో సిద్ధమవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news