“ఆదిపురుష్” మూవీ ఫైనల్ ట్రైలర్ అవుట్…

-

రెబల్ స్టార్ ప్రభాస్ మరియు అందాలతార కృతిసనన్ లు సీతారాములుగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వ బాద్యతహలను అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ సినిమా నుండి పోస్టర్లు, మోషన్ పోస్టర్ లు, టీజర్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ ట్రైలర్ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో శ్రీరాముడు మరియు పది తలల రావణాసురుడు మధ్యన భీకరమైన యుద్ధ సన్నివేశాలను చూపించారు. వీటి పట్ల సినీ ప్రేమికులు అమితానందాన్ని పొందినట్లుగా తెలుస్తోంది.

ఈ ట్రైలర్ అనంతరం సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పాలి. ప్రభాస్ కు ఈ సినిమాతో బాలీవుడ్ లో సరైన హిట్ దక్కుతుందని మేకర్స్ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news