ఎలాంటి విష నమూనాలు లేవు..

-

వైజాగ్ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో ఏర్పడిన గాయంలో ఎలాంటి విషనమూనాలు లేవని హైదరాబాద్ వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సిటీ న్యూరో సెంటర్ రాతపూర్వకంగా పేర్కొంది. గాయం అంత తీవ్రమైనది కాదని పేర్కొంది. జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం డాక్టర్ శివారెడ్డి బృందం పరీక్షించి .. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. కొద్ది పాటి జాగ్రత్తలతో ఆయన పాదయాత్రలో పాల్గొనవచ్చని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news