ఓటీటీలోకి రానున్న సైంధవ్… రిలీజ్ ఎప్పుడంటే….

-

హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం సైంధవ్‌ . ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.వెంకటేష్‌ నటించిన 75వ చిత్రనికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ హంగులతో నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం ఓటిటి హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 15 కోట్లకు ఈ చిత్రం ఓటిటీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.వచ్చే నెల మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 9 న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్  మూవీ శ్రీని కాబోతుందని తెలుస్తుంది.ఇదే సైంధవ్ ఓటీటీ విడుదల తేదీ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news