కత్తులతో దాడి… ఒకరు మృతి

-

నగర శివారులోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. యాప్రాల్‌లోని జేజే నగర్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జేజే నగర్‌లో నలుగురు వ్యక్తులు విక్కీ అలియాస్ చిన్నారెడ్డి, జోసఫ్, కృష్ణ, వికాస్ కుమార్లు మందస్తు పదకం ప్రకారం శ్రవణ్‌ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు… ఈ క్రమంలో శ్రవణ్ ఎదురు దాడిచేయడంతో విక్కీ అక్కడికక్కడే మృతిచెందగా… వికాస్ కుమార్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు.. ఈ గొడవకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news