కుర్చీ తాతను అరెస్టు చేసిన పోలీసులు….

-

కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్‌తో కాలా పాషా అలియాస్ కుర్చి తాత సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.కుర్చీతాతపై టిక్ టాక్ స్టార్ సత్య అలియస్ వైజాగ్ సత్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కుర్చి తాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుర్చీతాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు కుర్చీతాత తన డబ్బు కాజేసి పారిపోవడమే కాకుండా ఇష్టమొచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని సత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే కుర్చీతాతను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారట. సత్యను తాత ఎందుకు తీడుతున్నారు అనే విషయంపై నెటిజన్స్ ఆరా తీశారు. సత్య అనే వ్యక్తి.. కుర్చీ తాతను గుంటూరు కారం సినిమాలోని పాట కొరకు తమన్ కు పరిచయం చేశాడు. అలాగే మహేష్ బాబు దగ్గరకు కూడా తీసుకుని వెళ్లాలని కుర్చీతాత గొడవ చేస్తున్నాడట. అది కుదరదు అని చెప్పడంతో కుర్చీ తాత తనను టార్గెట్ చేసినట్లు వైజాగ్ సత్య చెబుతున్నాడు .

Read more RELATED
Recommended to you

Latest news