గవర్నమెంట్ జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు..!

-

ఓ యువకుడు గవర్నమెంట్ జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారానికి చెందిన 27 ఏళ్ల మనోజ్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నాడు. వనస్థలిపురంలోని హిల్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని భార్య, తల్లిదండ్రులతో ఉంటున్నాడు. కోచింగ్ తీసుకొని ఎన్ని పరీక్షలు రాసినప్పటికీ… దేంట్లోను సెలెక్ట్ అవ్వడం లేదని గత కొన్ని రోజుల నుంచి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నాడు. దాంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో తన రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న మనోజ్.. చీరతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన అతడి కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి అతడిని కిందికి దించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే.. మనోజ్ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version