తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ….

-

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం ఈరోజు బదిలీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు తమ శాఖలపై వరుస రివ్యూలు చేస్తూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో పోస్టింగ్లు ,అధికారుల బదిలీలలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇప్పటికే పలు సార్లు ఐఏఎస్ లను బదిలీ చేయగా.. తాజాగా మరోసారి ఆరుగురు ఐఏఎస్ లను ప్రభుత్వము బదిలీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

పశుసంవర్ధకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్‌,టీఎస్‌ఐఆర్‌డీ సీఈవోగా పీ కాత్యాయనిదేవి,ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌, వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శిగా టీ వినయ్‌కృష్ణారెడ్డిని నియమించింది. గనులశాఖ డైరెక్టర్‌గా సుశీల్‌ కుమార్‌,రోడ్లు భవనాలశాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news