రాహుల్ గాంధీ పై బీజేపీ దాడి చేయడం దుర్మార్గం : జగ్గారెడ్డి

-

అస్సాంలో రాహుల్ గాంధీ పై బీజేపీ దాడి చేయడం దుర్మార్గం అన్నారు జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ద్వారా ప్రజలను సంఘటితం చేస్తున్నారని తెలిపారు.  మోడీ పాలనలో పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయిందని.. అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అన్నారు జగ్గారెడ్డి.

మెప్పుకోసం రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారని.. రాహుల్ గాంధీ గుడికి పోవద్దా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గుడికి పోవాలంటే అస్సాం సీఎం అనుమతి అవసరమా..? మోడీ మెప్పు కోసం అస్సాం సీఎం ప్రయత్నిస్తున్నారని.. ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. అలాంటి రాహుల్ గాంధీని అడ్డుకునే కుట్ర చేస్తోంది బీజేపీ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news