తెలంగాణ తులసి వనంలో రేవంత్‌ రెడ్డి ఓ గంజాయి మొక్క..బాల్క సుమన్

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి తెలంగాణ అనే తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వాడని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. రేవంత్ ఇల్లు, కార్యాలయాలపై రెండు రోజులుగా సాగుతున్న ఐటీ దాడులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెరాసను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ప్రతీ విషయాన్ని తెరాసకు ముడిపెట్టడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందన్నారు.

జులై 14న రేవంత్‌కు నోటీసులు వస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. లక్షల్లో ట్యాక్స్ చెల్లిస్తూ వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తిని, ఖరీదైన కార్లను ఏవిధంగా రేవంత్ పొందారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడలేదని ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నేతలు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగే దొంగ అని అరిచినట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. తెలంగాణలో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news