ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ ప్రీమియర్స్ అప్‌డేట్‌….

-

అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలు విడుదల కావడంతో థియేటర్ల కొరత వలన ఈ చిత్రాన్ని తెలంగాణ, ఏపీలో రిలీజ్ చేయలేదు. సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా కి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కెప్టెన్ మిల్లర్ చిత్రం తెలుగులో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో ప్రియాంకామోహన్, శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.జనవరి 25న సాయంత్రం తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిక చేయబడ్డ థియేటర్లలో కెప్టెన్‌ మిల్లర్ స్పెషల్ ప్రీమియర్‌ ఉండనున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమాని తెలుగులో సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏసియన్ సినిమాస్‌ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాయి.జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందించాడు. కెప్టెన్‌ మిల్లర్ ఇప్పటికే తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్‌లో తన సత్తా చాటుతూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news