నేటి రైతు బంధు  నగదు బదిలీ..

-

తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోకి నేటి నుంచి బదిలీ చేయనున్నారు.  తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోనే జమచేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి 13లక్షల బ్యాంక్ ఖాతాలను సేకరించారు. సోమవారం 5లక్షల మంది రైతులకు వారి అకౌంట్లలో నగదు బదిలీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేకూరేలా తెరాస అధినేత కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏడాదికి ఎనిమిది వేలకు గానే మొదటి సారిగా ఎకరాకు నాలుగు వేలు ఇవ్వగా రెండో విడత మరో నాలుగు వేలను నేటి నుంచి అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news