నేను కాంగ్రెస్ లో చేరలేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

-

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కలిశారు. ఆదివారం సీఎం నివాసానికి వెళ్లారు.దాదాపు అరగంట పాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. తాజాగా దీనిపై ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

సీఎంను కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. నియోజకవర్గంలోని భూసమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరేందుకే వెళ్లినట్లు స్పష్టం చేశారు.నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version