పురందేశ్వరి టిడిపి- బీ టీం… ఆమె మాటలకు విలువ లేదు…

-

చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పురంధేశ్వరి టీడీపీ -బీ టీం అని,ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే పురంధరేశ్వరికి కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు ఏమైపోయావంటూ మండిపడ్డారు.

పురంధరేశ్వరి ఒక పార్టీ, ఆమె భర్త ఒక పార్టీ,కొడుకు రేపు ఇంకో పార్టీలో చేరతాడని మేరుగ నాగార్జున అన్నారు.పురంధేశ్వరి వైసీపీ పార్టీ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని అన్నారు. మీ నాన్న పెట్టిన పార్టీని, ఆస్తులను లాక్కుంటే ఎందుకు నోరు తెరవ లేకపోయావంటూ పురందేశ్వరుని ఆయన ప్రశ్నించారు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన మరిదిని ఏమి చేయలేక పోయారని ఆయన విమర్శించారు. చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని అందుకే ఎవరితో పొత్తుల్లేకుండా ప్రజా ఆమోదం పొందుతున్నారన్నారు. పురంధేశ్వరి మాటలకు విలువ లేదని ,చంద్రబాబు పొలిటికల్ బ్రోకర్ అంటూ మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news