పులి బయటకు వస్తోంది ….అప్పుడు ఆట మొదలవుతుంది – మల్లా రెడ్డి

-

శాసనసభ ఎన్నికల్లో గెలువగానే కాంగ్రెస్‌ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపే ఉంటారని మేడ్చల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..పులి వస్తుంది ……….అప్పుడు ఆట మొదలవుతుందని మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో అయిదు పదవులు ఉన్న ఏకైక నేత శంబిపూర్ రాజు అన్నారు. శంబిపూరి రాజు కారణంగానే ఇన్ని సీట్లు గెలవడం సాధ్యం అయ్యిందన్నారు.

 

బీఆర్ఎస్ సర్కార్ మంత్రి వర్గంలో తన పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలను గెలిపించింది నేనే అన్నారు. హరీష్ రావు కు కూడా ఈ సారి మరక అంటిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ అమలు చేయలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ లో అంతా యువ నేతలే… అందులో నేను కూడా యువకుడినే అని అన్నారు. ప్రజలు మర్చిపోయి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఎద్దేవా చేశారు. ఈసారి మాత్రం లోక్ సభ ఎన్నికలలో యుద్ధం చేసి విజయ సాధించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news