ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌తీసుకుంటేనే అసెంబ్లీకి- స్పీక‌ర్‌కు వైసీపీ బ‌హిరంగ లేఖ‌

-

అమ‌రావ‌తి : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. పార్టీ మారిన వారిని మంత్రులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ కోడెలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్పీకర్‌గా ఉంటూ కోడెల టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే గురువారం ఉదయాన్నే సభకు హాజరవుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news