అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేల‌కు జీతాలెందుకు? చ‌ంద్ర‌బాబునాయుడు

-

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకున్నా ఎందుకు జీతాలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజ‌ధానికి ఓ రూపు వ‌చ్చిందని, అమరావతి బాండ్ల విక్రయం ద్వారా 2వేల కోట్లు వ‌చ్చాయని తెలిపారు. పీడీ అకౌంట్లపై రాద్దాంతం చేయ‌డం త‌గ‌దన్నారు. కేంద్రంపై ధ‌ర్మ పోరాటం కొన‌సాగుతోందని మరోసారి స్పష్టం చేశారు. పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని, యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. కేంద్రం తెలంగాణకు సంబంధించిన బిల్లులు నాలుగురోజుల్లోనే పాస్ చేసిందని, ఏపీ విషయాన్ని వచ్చేసరికి క‌క్షక‌ట్టిన‌ట్టు వ్యవ‌హరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news