బిజినెస్ సెంటర్ గా మారిన తెలంగాణ జన సమితి..

-

తెలంగాణ జన సమతి (టీజేఎస్) ఓ బిజినెస్ సెంటర్ గా మారిందని ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత జ్యోత్స్న పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. టికెట్లు అమ్ముకునే దిలీప్ కుమార్ అనే వ్యక్తికి  పార్టీలో ఊహించని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

ఓ మహిళని చూడకుండా నాపై దాడి చేసేందుకు యత్నించారని ..తనకు, తన భర్తకు ఫోన్ చేసి బెదిరించడంతో పాటు అంబర్ పేట టికెట్ ఇవ్వనందువల్లే పార్టీకి జ్యోత్స్న రాజీనామా చేస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీ స్థాపించినప్పుడున్న లక్ష్యాలు దారితప్పాయన్నారు. త్వరలోనే మరికొందరు పార్టీని వీడనున్నట్లు ఆమె జోష్యం చెప్పారు. అయితే ఆమె ఆరోపణలపై కోదండరాం, ఇతర నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version