స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్లకూ ఆ గ్రామంలో వెలిగిన లైట్లు

-

మన దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని నాయకులు ఎన్ని గొప్పలు చెప్పినా ఇప్పటికే చాలా వరకు మారుమూల గ్రామాల్లో వీధిదీపాల సదుపాయం, రోడ్ల సదుపాయం, హాస్పిటల్ సౌకర్యాలు మెరుగవ్వలేదు. ప్రభత్వాలు మారుతూ ఉన్నా గిరిజనులు, అటవీ గ్రామాల్లో ఎటువంటి డెవలప్ మెంట్ కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే స్వాతంత్రం వచ్చిన 77ఏళ్ల తర్వాత ఓ గిరిజన గ్రామంలో తొలిసారిగా లైట్లు వెలిగాయి.ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా రోలుగుంట (మ) అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో మూడు కుటుంబాలు ఉండగా.. అందులో 26 మంది ఉంటున్నారు.
ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తొలి లైట్ వెలగడంతో గ్రామప్రజలు ఆనందంతో థింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version