భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ ‘బాక్సాఫీస్ క్రికెటర్’ -నాజర్ హుస్సేన్

-

నాజర్ హుస్సేన్ భవిష్యత్తులో క్రికెట్ దిగ్గజాలుగా

రచిన్ రవీంద్ర,శుభ్మన్ గిల్ అవతరిస్తారని

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వచ్చే ఏడాది భారత స్టార్ ప్లేయర్ రిషభ్

పంత్ ‘బాక్సాఫీస్ క్రికెటర్’ అవుతాడని నాజర్

అన్నాడు. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన

రిషభ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వచ్చే ఐపీఎల్

సీజన్నాటికి స్టేడియంలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్లో రిషబ్ పంత్ కీలకంగా మారనున్నాడని నాజర్ వ్యాఖ్యానించాడు.

రిషభ్ పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్రికెట్ ప్రపంచమంతా ఆందోళనకు గురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ నిరంతరం రిషబ్ పంత్ రికవరీ మీద దృష్టిపెట్టాడు. పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేను పాంటింగ్ వాకబు చేశా. మరికొద్ది రోజుల్లో రిషబ్ పంత్ స్టేడియంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. రిషభ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా సేవలు అందిస్తున్నాడు. ఇలాంటి ఇద్దరు ప్లేయర్స్ టీమ్ తో పాటు ఉండటం ఇండియా అదృష్టం.

Read more RELATED
Recommended to you

Latest news