మంత్రి ఎర్రబెల్లి: టెక్స్ టైల్ పార్క్ లో 20 వేల మందికి ఉపాధి

-

తెలంగాణలో ప్రజలకు మరో 20 వేల ఉద్యోగాలు కల్పించడానికి మంత్రి దయాకర్ రావు నేతృత్వంలోని టీం కృషి చేస్తోంది. వరంగల్ లో నిర్మించిన టెక్స్ టైల్ పార్క్ లో 20 వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే కుట్టు నేర్చుకోవడంలో శిక్షణ పొందిన రెండు వేల మంది ఇప్పుడు ఉద్యోగంలో చేరవచ్చని మంత్రి తెలియచేశారు. ఇప్పటికే ఈ టెక్స్ టైల్ పార్క్ లో చాలా కంపెనీ లు తమ ఉత్పత్తులను స్టార్ట్ చేశాయి. త్వరలోనే 20 వేల మందికి ఉద్యోగాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెక్స్ టైల్ పార్క్ కంపెనీలకు చెందిన వివిధ ప్రతినిధులు మరియు దానికి సంబంధించిన అధికారులతో సమావేశం అయ్యారు.

కాగా భవిష్యత్తులో ఇక్కడ ఇంకా ఏమి అభివృద్ధి చేయవచ్చు ? ఏ విధంగా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అన్న విషయంపైనా దృష్టి సారిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version