మరోసారి కచ్చితంగా తెరాస ప్రభుత్వమే…కేటీఆర్

-

తెరాస విజయానికిగత కొద్ది నెలలుగా కృషి చేసిన తెరాస కార్యకర్తలు, నాయకులకు మంత్రి కేటీఆర్‌కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. ఈసారి కూడా కచ్చితంగాతెరాస ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.. గెలుపై అభిప్రాయాన్నిపంచుకున్నారు. జిల్లాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం తెరాస సుమారు 100 స్థానాల్లో విజయ దుందుభిమోగించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఎన్నికలు అనంతరం వివిధ జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్‌ పోల్‌ఫలితాలను వెల్లడించాయి. మెజార్టీ ఫలితాలు తెరాసకు అనుకూలంగా వచ్చాయి..దీంతో తెరాసయేఅధికారంలోకి వచ్చే అవకాశముందని చెప్పాయి. వారందరికి భిన్నంగా మాజీ ఎంపీ లగడపాటిరాజగోపాల్‌ కూడా తన సర్వే ఫలితాలను వెల్లడించారు. అయితే ఆయన మాత్రం ప్రజా కూటమివిజయం సాధిస్తుందని చెప్పారు. 55-75 స్థానాలు ప్రజా కూటమికి వస్తాయని.. తెరాసకు 25-45 స్థానాలు రానున్నాయనివివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news