మరోసారి చిక్కుల్లో డిప్యూటీ సీఎం కుమారుడు..

-

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి కుమారుడు శ్యాంబాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు.  కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ నేత చెరుకుల పాడు నారాయణ రెడ్డి హత్య కేసులో స్థానిక ఎస్ఐ నాగతులసి ప్రసాద్, శ్యాంబాబులను హత్య కేసులో నిందితులుగా చేర్చాలంటూ ఆధారాలతో సహా ఆయన భార్య శ్రీదేవి గతేడాది డోన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శ్యాంబాబు, ఎస్ఐ ప్రసాద్ల లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

దీంతో డోన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో వారిని అరెస్ట్ చేయాలని కోర్టు మరోసారి ఆదేశాలు జారీచేసింది. తన భర్త ప్రాణాలను తీసిన వారికి శిక్ష పడే వరకు పోరాటం సాగిస్తానని శ్రీదేవి పేర్కొన్నారు. నిందితులపై తక్షణమే చర్యతీసుకోవాలని స్థానిక పోలీసులని కోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version