ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయిన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డితో శనివారం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి భేటి అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంను వంశీచందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో 3 రోజుల పాటు సాగిన యాత్ర విశేషాలు, ప్రజల నుండి లభిస్తున్న  ఆదరణ గురించి ముందుగానే తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.

గత పది సంవత్సరాల కాలంలో పాలమూరుకు జరిగిన అన్యాయం ,ప్రజల నుంచి వస్తున్న స్పందన  గురించి ముఖ్యమంత్రి , వంశీచందర్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరం ఉందని వంశీచందర్ రెడ్డి ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే ఇటు నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గాలకు సులభంగా సాగునీరు అందించడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. కాబట్టి ఈ పథకాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వంశీచందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news