మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించి సీఎం

-

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందగా మరో  10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది పరిస్థితి విషమంగానే ఉండటంతో ఘటనా స్థలంలోనే అత్యవసర చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వండి..

మృతుల‌ కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాలని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ ని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news