మేనల్లుడి ఎంగేజ్మెంట్ వేడుకలో ముఖ్యమంత్రి జగన్…

-

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవము హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో జరుగుతుంది.ఇటీవల ఏపీలోని తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లి షర్మిల శుభలేఖ అందించిన సంగతి మనకు తెలిసిందే.ఈ మేరకు నిశ్చితార్థ వేడుకకు సీఎం జగన్, భారతి దంపతులు హాజరయ్యారు. కాబోయే వధూవరులు వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరిని ఆశీర్వదించారు. తర్వాత చెల్లెలు షర్మిల, బావ అనిల్లను పలకరించారు.వైఎస్సాఆర్‌ మరణించిన తరువాత వారి కుటుంబంలో ఇదే మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటు అతిరథ మహారథులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరవుతున్నారు.ఈ మేరకు పోలీసులు గోల్కొండ రిసార్ట్స్‌ వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.

 

 

ఆంధ్ర, తెలంగాణ రుచులతో పాటు విదేశీ అతిధులకు ప్రత్యేకమైన వంటకాలు చేస్తున్నారు.రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం ఫిబ్రవరి 17న రాజస్థాన్‌లో,ఫిబ్రవరి 24న శంషాబాద్‌లో విందు ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news