రాహు ల్గాంధీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పగటి కలలు కంటున్నారని అమిత్షా విమర్శించారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న బీజేవైఎం మహా యువభేరి ముగింపు సభలో భాజపా అధ్యక్షుడు అమిత్షా మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ సారధిలేని రథం అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్గాంధీ ప్రధాని అభ్యర్థి కాదని కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. మోదీ పాలనలో నిరుపేదలు, రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన మహా నేత సర్దార్ వల్లాభాయ్ పటేల్ అని అన్నారు. మజ్లిస్, ఓవైసీ భయంతోనే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆరోపించారు. 2019లో మోదీ మరో సారి ప్రధాని కావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ కలలు కంటున్నారు… అమిత్ షా
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
తెలంగాణలో కాంగ్రెస్ గెలవబోయే ఎంపీ సీట్లు ఇవే.. డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు ముగిసింది. ఇక, జూన్ 4వ...
Anji N -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కేసీఆర్ ఫోకస్.. వారితో రేపు కీలక సమావేశం..!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి గ్రాడ్యుయేట్...
Anji N -
చిన్న కొడుకుతో చిల్ అవుతున్న బండి సంజయ్.. ఎక్స్ లో పోస్ట్..!
దాదాపు రెండు నెలల ప్రచారంలో తలమునకలైన ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు...
Anji N -