రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి బండ్ల గణేశ్

-

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు తెరాస ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, పలువురు తెరాస నేతలు కాంగ్రెస్  గూటికి చేరారు. రాహుల్ గాంధీ వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడుతూ..తాను చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ అభిమానిని, అధిష్టానం ఆదేశానుసారం ఏ పనిచెప్పిన చేసేందుకు సిద్ధం అన్నారు. పని చేస్తే పదవులు అవే వస్తాయి… పదవుల కోసం పనిచేసే రకం నేను కాదు… గంటకో పార్టీ రోజుకో కండువా కప్పుకునే అలవాటు లేదన్నారు. పవన్ కల్యాణ్ నాకు గురువుతో సమానం..కానీ చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అంటే అభిమానం అందుకే పార్టీ ద్వారా ప్రజలకు సేవచేయాలనుకుంటున్నా అని వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news