పర్యటనలో మంత్రి కాన్వాయ్ వాహనం బోల్తా

-

తప్పిన పెనుప్రమాదం.. గాయాలతో బయటపడ్డ తెలుగు తమ్ముళ్లు

అమరావతి (పోలవరం): సీఎం చంద్రబాబునాయుడు పోలవరం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్లో అనుచరుల కారు బోల్తా పడింది. కొండ వైపు బోల్తా పడడంతో ప్రమాదం తప్పింది. పలువురు టీడీపీ నాయకులు గాయపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంత్రి పుల్లారావు ఘటనాస్థలి పరిశీలించారు. సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ప్రమాదం గురించి పుల్లారావును అడిగితెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల పోలవరం పర్యటనలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దెందులూరు సమీపంలో ఓ బస్సు మట్టిలో దిగబడిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేరే వాహనాల్లో పోలవరానికి బయలుదేరి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news