విశాఖలో మావోయిస్టుల దాడి..ఎమ్మెల్యే మృతి

-

విశాఖ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టుల దాడిలో అరుకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోము అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దాడిలో మొత్తం 50 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. డుబ్రిగూడ మండలం తుటంగి దగ్గర మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిద్దరిని కాల్చిచంపారు. ఈ మధ్యనే కిడారి వైసీపీ నుంచి తెదేపాలో చేరారు. బాక్సైట్ తవ్వకాల్లో గిరిజనులకు అండగా ఉండాల్సిన కిడారి ప్రభుత్వంతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని గతంలో పలు మార్లు హెచ్చరించినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితమే మావోస్టులు మన్యంలో వారోత్సవాలు నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news