సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దగ్గుబాటి బ్రదర్స్….

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డినీ ఆయన నివాసంలో కలిసి , పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దగ్గుబాటి బ్రదర్స్ కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత చిరంజీవి, నాగార్జున ఇప్పటికే సీఎం ను కలిసిన సంగతి తెలిసిందే.

వెంకటేష్ నటించిన తాజా చిత్రం సైంధవ్. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. ఇక ఈ మూవీ కాకుండా ప్రస్తుతం వెంకటేష్ చేతిలో మరో రెండు మూవీస్ ఉన్నాయి. త్వరలోనే అవి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి అని సమాచారం. మరి ఈ సినిమాలతో అయిన వెంకటేష్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news