Radhika : ఆ సినిమాపై అసహనంతో పోస్ట్‌…నెట్టింట వైరల్‌

-

ఇటీవల తను వీక్షించిన ఓ సినిమా గురించి సీనియర్‌ నటి రాధిక శరత్ కుమార్ అసహనం వ్యక్తం చేస్తూ  సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్‌ ఏంటంటే ‘‘ఏదైనా సినిమా చూసి మీరు విసిగిపోయారా? నాకు అయితే ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేయాలనిపించింది. చాలా ఆగ్రహంగా ఉంది’’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. రాధిక మాట్లాడుతున్నది తాజాగా ఓటీటీలో విడుదలైన ‘యానిమల్‌’ సినిమా గురించేనని నెటిజన్లు పలు రకాలుగా పోస్ట్‌లు పెడుతున్నారు.  ‘‘మీరు మాట్లాడుతున్నది ‘యానిమల్‌’ చిత్రం  గురించే కదా మేడమ్‌’’ అంటూ  నెటిజన్స్ కామెంట్స్‌ పెడుతున్నారు. రాధిక మాత్రం తాను ఏ సినిమా  గురించి మాట్లాడుతున్నదనేది చెప్పలేదు.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా  నటించిన తాజా చిత్రం  ‘యానిమల్‌’. ఈ  చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది.రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా  స్ట్రీమింగ్  అవుతోంది. ఈ సినిమా  భారీ వసూళ్లు రాబట్టింది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో హింసలు తీవ్రస్థాయిలో చూపించారని ,కొన్ని సన్నివేశాల్లో స్త్రీని  తక్కువ చేసి చూపించారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రాధిక ట్వీట్‌ చేయడంతో ఆమె మాట్లాడుతున్నది ఈ సినిమా గురించేనని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news