కాంగో మ్యూజిక్ కన్సర్ట్​లో తొక్కిసలాట.. 11మంది దుర్మరణం

-

దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మర్చిపోక ముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్‌ కన్సర్ట్​కు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మరణించారు.

ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్రముఖ సంగీత వాద్యకారుడు ఫాలీ ఇపుపా కన్సర్ట్​లో ఈ తొక్కిసలాట జరిగింది. స్టేడియం వెలుపల ప్రజల్ని చెదరగొట్టేందుకు భద్రతా అధికారులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version