కొత్తగూడెంలో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు.వివిధ కేడర్లో పనిచేస్తున్న 14 మంది సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. నక్సలిజంలో కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉండటంతో వీటిని గమనించిన కొందరు లొంగిపోయేందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
లొంగిపోయిన సభ్యులకు ప్రభుత్వం తరఫున అనేక సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. లొంగిపోయిన వారికి వెంటనే 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని, అనంతరం ఉపాధి కొరకు దశలవారీగా ఆర్థిక సహాయం ప్రభుత్వం తరఫున చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ కేడర్ కు చెందిన వారు లొంగిపోతున్నారని వెల్లడించారు.