ఘోరం.. ఝార్ఖండ్‌లో 16 మందిని చంపిన ఏనుగు

-

ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల వ్యవధిలో 5 జిల్లాల్లో 16 మందిని హతమార్చింది. ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది. దీంతో ఇటకీ బ్లాకులో 144 సెక్షన్ విధించారు. ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని జరగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాంచీ డివిజనల్ అటవీ అధికారులు తెలిపారు.

ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో బయటకు రావద్దు. ఏనుగుకు దగ్గరగా ఎవరూ వెళ్లవద్దు. అంటూ ఇటకీ బ్లాకు గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

హజారీబాగ్‌, రామ్‌గఢ్‌, చతరా, లోహర్‌దగా, రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపిన ఏనుగును అడవుల్లోకి తరలించేందుకు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బాంకుడా జిల్లా నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శశికుమార్‌ సామంతా తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news