2.2 కేజీల నకిలీ బంగారం పట్టివేత.. ఎక్కడంటే?

-

ఏపీలోని వైజాగ్‌ లో 2.2 కేజీల నకిలీ బంగారాన్ని ద్వారకానగర్ పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకుల్లో గోల్డ్ విడిపించి కమీషన్ వ్యాపారం చేసే జగదీశ్వర్ రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో దొంగ బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు.

రుపిక్ బ్యాంకులో మోహన్ రావు అనే వ్యక్తి రూ.68 లక్షల 31 వేల టేకవర్‌ లోన్ తీసుకుని మోసానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, జగదీశ్, అవినాష్ అనే ఇద్దరు స్నేహితులు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్‌కు రూ.68 లక్షల 31 వేలు నగదును ట్రాన్స్‌ఫర్‌ చేసి గోల్డ్ విడిపించుకున్నారు. ఆ తర్వాత ఆ బంగారం చెక్ చేయగా అసలు మోసం బయటపడింది. కాగా, నకిలీ బంగారంతో మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news