రెండేళ్ళ పాప ప్రాణం తీసిన పిల్లి

-

తమిళనాడులో ఓ చిన్నారి ప్రాణాలు తీసింది పిల్లి. అదేంటి పిల్లి ప్రాణాలు తీయడం ఏంటి ? వెటకారంగా ఉందా ? అనుకోవద్దు. నిజంగానే రెండేళ్ళ పాప ప్రాణం పోవడానికి కారణం అయింది ఒక పిల్లి. వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాజధాని చెన్నైలో రెండేళ్ల పాపను తమ గదిలో పడుకోబెట్టి బయట అమ్మానాన్న పని చేసుకుంటున్నారు. సరిగ్గా టీవీకి కింద ఆమెను పడుకోబెట్టారు. పెద్దవాళ్ళు ఇద్దరూ బయట ఉండడం, పాప పడుకుని ఉండడంతో అటుగా వచ్చిన ఓ పిల్లి ఆ గదిలో అటు నుండి ఇటు దూకడానికి యత్నించింది.

అలా టీవీ పెట్టిన చెక్కబల్ల మీదకు దూకగా దాని అదురుకు ఆ టీవీ జారి కింద పడుకున్న పాప మీద పడింది. వెంటనే తలకు దెబ్బ తగలడంతో ఆ పాప అక్కడికక్కడే మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమ్మాయి పడుకున్న ప్రదేశం ఆ టీవీ కు దగ్గరగా ఉంది, టీవీ పడడం పడడం తల మీద పడడంతో పాప చనిపోయినట్టు తేల్చారు. అయితే కొంతసేపటికి లోపలి వచ్చిన తల్లి తండ్రులకి ఆ గదిలో పిల్లి, ఈ టీవీ పడిన విధానం కనిపించింది. వెంటంటే పాప పలకక పోవడంతో ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్టు తేల్చారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version